సంగీత దర్శకుడిగా మారనున్న పాటల రచయిత అనంత్ శ్రీరామ్

- April 21, 2017 , by Maagulf
సంగీత దర్శకుడిగా మారనున్న పాటల రచయిత అనంత్ శ్రీరామ్

కొంత మంది పాటలు రాస్తారు.. పాడతారు.. పాటలను కంపోజ్ చేస్తూ మల్టీటాలెంటెడ్ పర్సన్ గా పేరు తెచ్చుకొంటారు.. అటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ లో టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపించే పేరు దేవి శ్రీ ప్రసాద్. కానీ పాటలు రాసే కవి.. సంగీతం అందించే దర్శకుడిగా మారింది బహు అరుదు.. తాజాగా పాటల రచయిత అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడిగా మారనున్నాడు. అనంత్ శ్రీరామ్ ఇప్పటికే 800 పాటలను రాశాడు.. కాగా తాజాగా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటిస్తున్న సాయి.. నీ.. లీలలు చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఆది అనంత్ ఫిలిం పేరుతో శ్రీరామ్ సంగీతం అందించనున్నాడు.. పాటల రచయితగా అందరినీ ఆకట్టుకొన్న అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా కూడా ఆకట్టుకొంటాడు అని భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com