ఇంధన ట్యాంకర్ ను ' ఢీ ' కొట్టిన కారు మంటలలో సజీవ దహనమైన టాక్సీ డ్రైవర్
- April 21, 2017
స్థానిక జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 33 టన్నుల పెట్రోలియంను తీసుకెళుతున్నఇంధన ట్యాంకర్ ను ఓ కారు వేగంగా ఎదురుగా వచ్చి ' ఢీ ' కొట్టిన ఘటనలో టాక్సీ డ్రైవర్ కాలి బుగ్గిగా మారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సివిల్ డిఫెన్స్ తెల్పింది. ఈ ప్రమాదంపై త్వరితగతిన జోక్యం చేసుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఈ వాహనాలు ఒకదానితో ఒకటి 'ఢీ' కొన్నాయి. దీంతో శుక్రవారం ఉదయం జెడ్డా-మక్కా వేగవంతమైన మార్గంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. కనీసం మరో రెండు కార్లు సైతం మంటల్లో చిక్కుకున్నాయిని మక్కా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి నఇఫ్ అల్-షరీఫ్ చెప్పారు. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ మంటలలో సజీవ దహనం కాగా మరో ముగ్గురు ఈ ప్రమాదం నుండి రక్షించబడ్డారు. అగ్నికీలలలో బూడిదగా మాదిరిపోయిన ఆ కారు డ్రైవర్ ఎవరో వెంటనే గుర్తించబడలేదు. శుక్రవారం వేకువజామున 1గంటకు ఈ దుర్ఘటన జరిగింది. మక్కా నుండి అగ్నిమాపక బృందాలు హుటాహుటిన సన్నివేశానికి చేరుకొన్నారు తెలిపారు. అగ్నిమాపక దళాలు ఆయిల్ టాంకర్ ...కారు నుంచి వెలువడుతున్న మంటల్ని అదుపు చేసిన తర్వాత హైవేలో వెదచల్లబడిన చమురు తెట్టుని తొలగించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







