మహేష్ బాబు ఒక్కడు కు సీక్వెల్ రాబోతుంది తమిళ్ లో

- April 22, 2017 , by Maagulf
మహేష్ బాబు ఒక్కడు కు సీక్వెల్ రాబోతుంది తమిళ్ లో

మహేష్ బాబు కెరియర్ ను మలుపు తిప్పిన మూవీ ఒక్కడు..డైరెక్టర్ గుణ శేఖర్ ను అగ్ర దర్శకుల్లో చేర్చడమే కాదు మహేష్ కు మాస్ లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిన మూవీ కూడా..ఇదే సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేశారు. గిల్లి పేరుతో కోలీవుడ్ ఒక్కడు రీమేక్ కాగా.. ఇళయ దళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ధరణి దర్శకత్వంలో త్రిష హీరోయిన్ గా తమిళ్ ఒక్కడు రూపొందింది.
తాజాగా ఇప్పుడు ధరణి ఓ ఆసక్తి కరమైన విషయం చెప్పాడు. తాను గిల్లి చిత్రానికి సీక్వెల్ చేయాలని భావించడమే కాదు.. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసానని. అంతే కాదు.. విజయ్ కు వినిపించడం కూడా జరిగిపోయిందట.
విజయ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అప్పుడు మూవీ స్టార్ట్ చేస్తానని తెలిపాడు. తెలుగు లో కూడా గుణశేఖర్ సీక్వెల్ మొదలు పెడితే బాగుండు అని మహేష్ అభిమానులు అనుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com