మెట్రాష్ 2 ద్వారా ప్రమాదాలు నమోదు చేయాలని కోరిన ఆంతరంగిక మంత్రిత్వ శాఖ
- April 24, 2017
చిన్న రహదారి ప్రమాదాలను మెట్రాష్ 2 మొబైల్ అప్లికేషన్ ద్వారా నివేదించాలని వాహన సిబ్బందిని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ కోరింది. ఈ సేవలను ఆగస్టు 2016 లో ప్రారంభించినప్పటికీ, అవగాహన లేనందున కొంతమంది వాహనదారులు మాత్రమే ప్రయోజనం పొందారు. ఇ-సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగం అధిపతి ఆలీ అహ్మద్ అల్ బైనీ తెలిపారు. .2016 ఆగస్టులో మేము ఈ సేవను ప్రారంభించాము, ఈ సంవత్సరం ప్రారంభం వరకు, మేట్రాష్ 2 ద్వారా నమోదైన చిన్న ప్రమాదాల్లో 2,187 కేసులు మాత్రమే మా దృష్టికి వచ్చాయి. దేశంలో జరిగే చిన్న ప్రమాదాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది.వాస్తవంగా అన్ని రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం చిన్న ప్రమాద సంఘటనలు ఉంటాయని ఆయన అన్నారు. .చిన్న ట్రాఫిక్ ప్రమాదాల్లో చిక్కుకొన్న వాహనదారులు కోసం ఆయా విధానాలను సులభతరం చేయడానికి ఈ సేవను ప్రారంభించడంజరిగిందన్నారు.చాలా మంది వాహనదారులకు మెట్రాష్ 2 ద్వారా చిన్న ప్రమాదాలు సైతం నమోదు చేయలేరని తెలియదు. అలాగే, సేవను ఎలా పొందాలనే విషయం సాకీతం అత్యధికులకు తెలియదు. అనేక వాహనదారులు, వారు చిన్న ప్రమాదాలు రిపోర్ట్ చేయాలనుకున్నప్పుడు, వాహనాల చిత్రాలను పంపాలని , ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను పంపడం మర్చిపోతారు. ఫోటోలన్నీ తగినంత వివరాలను లేకపోవడం బట్టి ప్రమాద పరిశోధకులు కష్టపడతారని అలాగే మెట్రాష్ 2 గురించి మీడియాలోదీనిపై తగినంత ప్రచారం లేకపోవడంతో, వాహనదారులు దాని గురించి తెలియదు మరియు అదనంగా, దాని గురించి తెలిసిన వారికి కూడా ప్రమాదాలు నివేదించడానికి సరైన చర్యలు తీసుకోవని పోలీసు పత్రిక అల్ శర్తా మాక్ (మీతో పోలీస్) తో ఇచ్చిన ముఖాముఖిలో కార్యక్రమంలో కెప్టెన్ అల్ బైనీ తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







