గల్ఫ్ సమస్యలపై స్పందించిన కేటీఆర్
- April 24, 2017
గల్ఫ్ సమస్యల పరిష్కారానికై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ కోరింది. సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తో సోమవారం భేటి అయిన ఏన్నారై టీఆర్ఎస్ సెల్ గల్ఫ్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. గల్ఫ్ లో జరుగుతున్న వాస్తవాలపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, గల్ఫ్ బిడ్డల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఎన్నారై పాలసీని అమలు చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, ఎన్నారై శాఖ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం , ఎన్నారై విభాగాల కోఆర్డినేటర్ మహేష్ బిగాల మంత్రిని కోరారు.
స్వరాష్ట్ర పాలనలో కోటి ఆశలతో దీర్ఘకాలంగా వేచి చూస్తున్న లక్షలాది వలస దారులకు భరోస కావాలని గల్ఫ్ బిడ్డల కష్టాలను, సమస్యలను, పరిష్కారాలతో కూడిన నివేదికను వారు కేటీఆర్కు అందజేసి.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ సమస్యలపై కేటీఆర్ సానుకూలంగా స్పంచిందచారని, తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కష్టాలను, సమస్యలను అన్ని విధాలా పరిష్కరించేలా హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







