స్కూల్ టీచర్ సామాజిక బాధ్యత
- April 24, 2017
జెడ్డా: జెడ్డాలోని ఓ స్కూల్ టీచర్, సోషల్ క్యాంపెయిన్ని ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్లో 50 మందికి పైగా విద్యార్థినులు పాల్గొంటున్నారు. ఏడాది పాటు ఈ కార్యక్రమం జరగనుంది. స్కూళ్ళలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై చైతన్యం కల్పించడం ఈ క్యాంపెయిన్లో భాగం. తద్వారా పవర్ఫుల్ సొసైటీకి మార్గం సుగమం చేయడం, అలాగే విద్యార్థుల్లో నెగెటివ్ యాటిట్యూడ్ని తగ్గించడం వంటి కీలక అంశాలు ఈ క్యాంపెయిన్లో ఉన్నాయి. ఈ క్యాంపెయిన్ ఫౌండర్ నజా అల్సులామి మాట్లాడుతూ, ఆన్లైన్ ద్వారా కూడా ఈ క్యాంపెయిన్ని విస్తృతంగా చేపట్టబోతున్నామని చెప్పారు. వర్క్ షాపులు నిర్వహించడం, డిస్కషన్ వేదికల్ని నిర్వహించడం వంటి చర్యల ద్వారా సమాజంలో మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వివరించారామె. రేడియో ప్రోగ్రామ్స్, స్కూల్ విజిట్స్ ద్వారా ఈ క్యాంపెయిన్ని ఉధృతం చేస్తారు. ప్రెజెంటేషన్, ఇంప్లిమెంటేషన్, కంటిన్యూయేషన్ - ఇలా ఈ ప్రోగ్రామ్ని అత్యున్నత రీతిలో విజయవంతం చేస్తామని అల్సులామి వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







