ఓయూకు రాష్ట్రపతి.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- April 25, 2017
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ బుధవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, ఇఫ్లూ స్నాతకోత్సవాల్లో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ను నిలిపివేయనున్నారు. మరికొన్నిచోట్ల ట్రాఫిక్ను మళ్లించనున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఓయూ మార్గంలో ఈ ఆంక్షలు కొనసాగించనున్నారు. బేగంపేట నుంచి ఓయూ మార్గంలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఓయూ శతాబ్ది వేడుకల అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ రాజ్భవన్కు వెళ్లనుండటంతో ఓయూ నుంచి రాజ్భవన్ వైపు మార్గంలో మధ్యాహ్నం 1.15 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం రాజ్భవన్ నుంచి రాష్ట్రపతి గచ్చిబౌలికి వెళ్లనుండటంతో ఈ సందర్భంగా రాజ్భవన్ నుంచి గచ్చిబౌలి మార్గంలో రేపు సాయంత్రం 4గంటల నుంచి 4.45 వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించనున్నారు. ఇఫ్లూ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని దిల్లీకి వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









