పాకిస్థాన్‌లో బాంబు పేలుడు 10మంది మృతి

- April 25, 2017 , by Maagulf
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు 10మంది మృతి

-ఆరుగురు చిన్నారులు సహా 10మంది మృతి 
పెషావర్: పాకిస్థాన్‌లోని ఖుర్రం గిరిజన ప్రాంతం కొంతారా గ్రామంలో తాలిబన్ ఉగ్రవాదులు మంగళవారం ఓ వ్యాన్ లక్ష్యంగా రిమోట్ కంట్రోల్‌తో శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 10 మంది మృతిచెందారు. గాయపడ్డ 13మందిని సమీపంలోని దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు పెషావర్‌లో వైద్యసేవలు అందించేందుకు ఖుర్రం రాజధాని పరచినర్‌కు ఎంఐ-17 హెలీకాప్టర్ పంపించామని సైనిక సమాచార విభాగ అధికారులు తెలిపారు. తెహ్రిక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ చీలికవర్గ నేత జమ్మాతుల్ అహరర్ ఈ దాడి చేసినట్లు ప్రకటించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com