పాకిస్థాన్లో బాంబు పేలుడు 10మంది మృతి
- April 25, 2017
-ఆరుగురు చిన్నారులు సహా 10మంది మృతి
పెషావర్: పాకిస్థాన్లోని ఖుర్రం గిరిజన ప్రాంతం కొంతారా గ్రామంలో తాలిబన్ ఉగ్రవాదులు మంగళవారం ఓ వ్యాన్ లక్ష్యంగా రిమోట్ కంట్రోల్తో శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 10 మంది మృతిచెందారు. గాయపడ్డ 13మందిని సమీపంలోని దవాఖానకు తరలించారు. క్షతగాత్రులకు పెషావర్లో వైద్యసేవలు అందించేందుకు ఖుర్రం రాజధాని పరచినర్కు ఎంఐ-17 హెలీకాప్టర్ పంపించామని సైనిక సమాచార విభాగ అధికారులు తెలిపారు. తెహ్రిక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ చీలికవర్గ నేత జమ్మాతుల్ అహరర్ ఈ దాడి చేసినట్లు ప్రకటించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









