అధికార దుర్వినియోగ కేసుల్లో అవినీతి 111 కేసుల పరిశీలన

- April 26, 2017 , by Maagulf
అధికార దుర్వినియోగ కేసుల్లో అవినీతి 111 కేసుల పరిశీలన

ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అధికారి ఒకరు  చేసిన ఉల్లంఘనలపై   జాతీయ అవినీతి నిరోధక కమీషన్ (నజాహా) దర్యాప్తు పూర్తి చేసింది. ఆయన యూనివర్శిటీలో లో తన బంధువులు మరియు కుమారులు నియమించడం ద్వారా  తన అధికార దుర్వినియోనికి పాల్పడినట్లు  అల్-హయత్ వార్తాపత్రిక మంగళవారం ప్రచురించింది.విశ్వవిద్యాలయాలలో ఆ అధికారులను  గుర్తించలేదు కానీ సుప్రీం అధికారులను ఉపయోగించి పరిశోధనల ఫలితాలను త్వరలోనే కమిషన్ వెలువరించనుంది. .గత సంవత్సరం  జాతీయ అవినీతి నిరోధక కమీషన్ (నజాహా) 111 మంది అవినీతి కేసులు నమోదు చేశారు. అధికారులు తమ తమ అధికార దుర్వినియోగం ప్రదర్శించారని , ఆయా నియంత్రణలు, పర్యవేక్షక సంస్థలకు  వ్యతిరేకంగా అవసరమైన శిక్షాస్మృతి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు వ్యక్తిగత లాభాలను సంపాదించడానికి తమ అధికారాన్ని ఉపయోగించి, అధికారిక పత్రాలను తమ నేరాలకు కప్పిపుచ్చి, ప్రభుత్వ నిధులను కైంకర్యం చేసేరని పేర్కొన్నాయి.కొన్ని సంవత్సరాల క్రితం ఈ తనిఖీ  ఆరంభమైనప్పటి నుంచీ, అనేకమంది అవినీతిపరులు తాము   అపహరించిన బిలియన్ల రియాల్లను వారికి తిరిగి ఇచ్చివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com