వాటర్ మెయిన్స్ పగుళ్ళతో ఆందోళన
- April 27, 2017
జెడ్డా: కింగ్ అబ్దుల్ అజీజ్ బ్రిడ్జ్ కింద మకరోనా స్ట్రీట్లో వాటర్ మెయిన్స్ పగుళ్ళ కారణంగా నీరు రోడ్డుపైకి ఎగజిమ్మింది. దాంతో అక్కడి నివాసితులు ఆందోళన చెందారు. ఈ ఘటనతో బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లుతుందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నేషనల్ వాటర్ కంపెనీ పాత్రపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. నీటి సమస్యతో తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ ఈ సమయంలో ఇంత నీటి వృధాని తాము జీర్ణించుకోలేకపోతున్నామని నివాసితులు చెప్పారు. లీకేజీ నీరు కారణంగా మురుగు ఎక్కువవుతోందనీ, తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అహ్మద్ అల్ అహ్మది అనే రెసిడెంట్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







