వాటర్‌ మెయిన్స్‌ పగుళ్ళతో ఆందోళన

- April 27, 2017 , by Maagulf
వాటర్‌ మెయిన్స్‌ పగుళ్ళతో ఆందోళన

జెడ్డా: కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ బ్రిడ్జ్‌ కింద మకరోనా స్ట్రీట్‌లో వాటర్‌ మెయిన్స్‌ పగుళ్ళ కారణంగా నీరు రోడ్డుపైకి ఎగజిమ్మింది. దాంతో అక్కడి నివాసితులు ఆందోళన చెందారు. ఈ ఘటనతో బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లుతుందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నేషనల్‌ వాటర్‌ కంపెనీ పాత్రపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. నీటి సమస్యతో తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ ఈ సమయంలో ఇంత నీటి వృధాని తాము జీర్ణించుకోలేకపోతున్నామని నివాసితులు చెప్పారు. లీకేజీ నీరు కారణంగా మురుగు ఎక్కువవుతోందనీ, తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అహ్మద్‌ అల్‌ అహ్మది అనే రెసిడెంట్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com