అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయినవారికి చేయూత

- April 29, 2017 , by Maagulf
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయినవారికి చేయూత

వంద మందికి పైగా కార్మికులు, తాము నివాసం ఉంటోన్న క్యాంప్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో సర్వం కోల్పోయారు. బట్టలు, తమకు సంబంధించిన వస్తువులు, డబ్బులు సైతం ఈ ప్రమాదంలో కాలిపోయాయి. మొత్తం 160 మంది కార్మికులు ఈ అగ్ని ప్రమాదంతో రోడ్డునపడ్డారు. అయితే, అదృష్టవశాత్తూ వారందరినీ వారి సన్నిహితులు ఆదుకున్నారు. తాము నివాసం ఉంటోన్న చోట వారికి ఆశ్రయం కూఆ కల్పించారు. వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, ప్రమాదం గుర్తించిన వెంటనే అందరం అక్కడి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నామని పాకిస్తానీ కార్మికుడైన మొహమ్మద్‌ మసూద్‌ చెప్పారు. ఎలక్ట్రికల్‌ షాక్‌ సర్క్యూట్‌ ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. బాధితులకు తగిన సహాయం అందజేస్తామని వారు పనిచేస్తోన్న సంస్థ ప్రతినిథులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com