మంచు మనోజ్ ద్విపాత్రాభినయం
- April 29, 2017
మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన పాత్ర పోషిస్తున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహిస్తున్నారు. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. ఎస్.ఎన.రెడ్డి, లక్ష్మీకాంత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదివారంతో చివరి షెడ్యూల్ పూర్తవుతుంది. కథానాయిక ఫస్ట్ లుక్ను శనివారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ''1990ల కాలంనాటి శ్రీలంక యుద్దం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మనోజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు.
అనీషా ఆంబ్రోస్ జర్నలిస్ట్గా కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకం. ఇటీవల విడుదల చేసిన హీరో లుక్కి మంచి స్పందన వచ్చింది. ఆదివారంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలో ట్రైలర్ను, పాటల్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.కోదండరామరాజు, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, సంగీతం: శివ నందిగామ, స్కీనప్లే: గోపీమోహన్.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







