మంచు మనోజ్ ద్విపాత్రాభినయం
- April 29, 2017
మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన పాత్ర పోషిస్తున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహిస్తున్నారు. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. ఎస్.ఎన.రెడ్డి, లక్ష్మీకాంత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదివారంతో చివరి షెడ్యూల్ పూర్తవుతుంది. కథానాయిక ఫస్ట్ లుక్ను శనివారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ''1990ల కాలంనాటి శ్రీలంక యుద్దం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మనోజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు.
అనీషా ఆంబ్రోస్ జర్నలిస్ట్గా కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకం. ఇటీవల విడుదల చేసిన హీరో లుక్కి మంచి స్పందన వచ్చింది. ఆదివారంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలో ట్రైలర్ను, పాటల్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.కోదండరామరాజు, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, సంగీతం: శివ నందిగామ, స్కీనప్లే: గోపీమోహన్.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









