మంచు మనోజ్ ద్విపాత్రాభినయం
- April 29, 2017
మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన పాత్ర పోషిస్తున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహిస్తున్నారు. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. ఎస్.ఎన.రెడ్డి, లక్ష్మీకాంత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదివారంతో చివరి షెడ్యూల్ పూర్తవుతుంది. కథానాయిక ఫస్ట్ లుక్ను శనివారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ''1990ల కాలంనాటి శ్రీలంక యుద్దం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మనోజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు.
అనీషా ఆంబ్రోస్ జర్నలిస్ట్గా కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకం. ఇటీవల విడుదల చేసిన హీరో లుక్కి మంచి స్పందన వచ్చింది. ఆదివారంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలో ట్రైలర్ను, పాటల్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.కోదండరామరాజు, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, సంగీతం: శివ నందిగామ, స్కీనప్లే: గోపీమోహన్.
తాజా వార్తలు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!









