అమరావతి ప్రాంతంలో సాఫ్ట్వేర్ సంస్థలను ఏర్పాటు ఎన్నారైల తోడ్పాటు
- April 30, 2017
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో సాఫ్ట్వేర్ సంస్థలను ఏర్పాటు చేయడానికి అనేకమంది ఎన్నారైలు ముం దుకు వస్తున్నట్లు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ తెలిపారు. విభజన తరువాత నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో చికాగోలో నాట్స్ తెలుగు సంబరాలకు సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తదితరులకు ఆహ్వానాలను అందించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రధానంగా డిజిటల్ తరగతులు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామన్నారు. జన్మభూమి, చదువుకున్న విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామని మోహనకృష్ణ స్పష్టం చేశారు.
మంచి విద్యాసంస్థలను ఎన్నుకోవాలి
ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చేవారు మంచి విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవాలని నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ తెలిపారు. గుర్తింపుల్లేని సంస్థల్లో చేరి ఇబ్బందులు పడవద్దని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









