'దర్శకుడు' మూవీ వీడియో పోస్టర్ విడుదల
- April 30, 2017
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న 'దర్శకుడు' చిత్ర వీడియో పోస్టర్ ని సెన్సేషనల్ త్రయం దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, సుకుమార్ లు విడుదల చేశారు.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై వచ్చిన 'కుమారి 21 ఎఫ్' చిత్రం ఎంతటి సెన్సేషన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత వస్తున్న 'దర్శకుడు' చిత్రాన్ని సుకుమార్ తో కలిసి బిఎన్సిఎస్పి విజయ్కుమార్, థామస్ రెడ్డి ఆదూరి మరియు రవిచంద్ర సత్తి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశోక్, ఈషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు హరిప్రసాద్ జక్కా. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సమ్మర్ కి విడుదల అయ్యేందుకు షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.
ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: నవీన్ నూలీ, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ కోలా.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









