ప్రపంచంలో చాక్లెట్ వినియోగంలో భారత్ ముందంజ
- April 30, 2017
ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న చాక్లెట్ మార్కెట్లలో భారత్ ముందంజలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో 13శాతం వృద్ధి నమోదు చేసిందని ఒక పరిశోధనలో వెల్లడైంది. లండన్కు చెందిన అంతర్జాతీయ సంస్థ మింటెల్ ఈ పరిశోధన నిర్వహించింది. మిగతా దేశాల్లో వీటి అమ్మకాలు స్తంభించిపోయాయని, 2016లో భారతీయులు 2,28,000 టన్నుల వినియోగించినట్లు పేర్కొంది. 2016లో ఆస్ట్రేలియా 95,000, ఇండోనేషియా 94,000 టన్నుల చాక్లెట్ను వినియోగించాయి. గతేడాదితో పోలిస్తే భారత్(13శాతం), పొలాండ్(2శాతం) మాత్రమే అంతర్జాతీయంగా అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 43శాతం మంది భారతీయులు చక్కెరతో తయారు చేసిన స్నాక్స్.. చాక్లెట్, కేక్లను మధ్యాహ్న భోజనం- రాత్రి భోజనం మధ్యలో తీసుకుంటున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!
- జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తం కావాలంటూ విమానయాన సంస్థలకు కేంద్ర మంత్రి సూచనలు









