ప్రపంచంలో చాక్లెట్‌ వినియోగంలో భారత్‌ ముందంజ

- April 30, 2017 , by Maagulf
ప్రపంచంలో చాక్లెట్‌ వినియోగంలో భారత్‌ ముందంజ

ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న చాక్లెట్‌ మార్కెట్లలో భారత్‌ ముందంజలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో 13శాతం వృద్ధి నమోదు చేసిందని ఒక పరిశోధనలో వెల్లడైంది. లండన్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ మింటెల్‌ ఈ పరిశోధన నిర్వహించింది. మిగతా దేశాల్లో వీటి అమ్మకాలు స్తంభించిపోయాయని, 2016లో భారతీయులు 2,28,000 టన్నుల వినియోగించినట్లు పేర్కొంది. 2016లో ఆస్ట్రేలియా 95,000, ఇండోనేషియా 94,000 టన్నుల చాక్లెట్‌ను వినియోగించాయి. గతేడాదితో పోలిస్తే భారత్‌(13శాతం), పొలాండ్‌(2శాతం) మాత్రమే అంతర్జాతీయంగా అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 43శాతం మంది భారతీయులు చక్కెరతో తయారు చేసిన స్నాక్స్‌.. చాక్లెట్‌, కేక్‌లను మధ్యాహ్న భోజనం- రాత్రి భోజనం మధ్యలో తీసుకుంటున్నట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com