భద్రతా సిబ్బందిపై హత్యా ప్రయత్నానికి పాలపడ్డ సౌదీ వ్యక్తికి మరణశిక్ష
- May 01, 2017
భద్రతా సిబ్బందికి చెందిన ఆల్ అల్వామీయా పోలీసుని చంపడానికి తుపాకీతో కాల్పులు జరిపిన నేరంలో దోషిగా ఎంచబడ్డ ఒక పౌరునికి వ్యతిరేకంగా ప్రాథమిక మరణ శిక్షను రియాద్ లో ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ ఆదివారం తీర్పుని విడుదల చేసింది.ఈ కేసులో అధ్యక్షత వహిస్తున్న న్యాయమూర్తి నేర తీవ్రవాద నేపధ్యమున్న నేరస్తుడిని కనుగొన్నట్లు న్యాయస్థానం ధృవీకరించింది మరియు అల్-అవామియ పోలీసు స్టేషన్ దగ్గర చంపే ఉద్దేశ్యంతో భద్రతా అధికారులపై తుపాకీతో షూటింగ్ చేయడం ద్వారా దేశం యొక్క భద్రతను అస్థిరపరిచేందుకు అతను ఇతరులతో కలిసి వ్యతిరేకంగా పనిచేశాడు, తీవ్రవాది ఒక కలష్నికోవ్ మెషిన్ గన్ మరియు 20 బులెట్లు కొనుగోలు చేసినట్లు పరిశోధనలో తేలింది. దేశంలో అసమ్మతి రేకెత్తించేందుకు, భద్రతా అస్థిరపరిచేందుకు అల్- అహ్వామియహ్ లో వీధి లైట్ స్తంభాలపై నల్లని జెండాలు కట్టాడు. తీవ్రవాదులకు మద్దతుగా ఆ వ్యక్తి చేసిన చర్యల పట్ల కోర్ట్ ఆ నేరస్తుడికి మరణ శిక్షను జారీ చేయాలని నిర్ణయించింది.అంతకుముందు రియాద్ ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ ఖ్ఆతిఫ్ మరియు అల్- అహ్వామియహ్ లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా పలువురు తీవ్రవాదులు వ్యతిరేకంగా తీర్పులు జారీ కాబడ్డాయి.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







