భద్రతా సిబ్బందిపై హత్యా ప్రయత్నానికి పాలపడ్డ సౌదీ వ్యక్తికి మరణశిక్ష
- May 01, 2017
భద్రతా సిబ్బందికి చెందిన ఆల్ అల్వామీయా పోలీసుని చంపడానికి తుపాకీతో కాల్పులు జరిపిన నేరంలో దోషిగా ఎంచబడ్డ ఒక పౌరునికి వ్యతిరేకంగా ప్రాథమిక మరణ శిక్షను రియాద్ లో ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ ఆదివారం తీర్పుని విడుదల చేసింది.ఈ కేసులో అధ్యక్షత వహిస్తున్న న్యాయమూర్తి నేర తీవ్రవాద నేపధ్యమున్న నేరస్తుడిని కనుగొన్నట్లు న్యాయస్థానం ధృవీకరించింది మరియు అల్-అవామియ పోలీసు స్టేషన్ దగ్గర చంపే ఉద్దేశ్యంతో భద్రతా అధికారులపై తుపాకీతో షూటింగ్ చేయడం ద్వారా దేశం యొక్క భద్రతను అస్థిరపరిచేందుకు అతను ఇతరులతో కలిసి వ్యతిరేకంగా పనిచేశాడు, తీవ్రవాది ఒక కలష్నికోవ్ మెషిన్ గన్ మరియు 20 బులెట్లు కొనుగోలు చేసినట్లు పరిశోధనలో తేలింది. దేశంలో అసమ్మతి రేకెత్తించేందుకు, భద్రతా అస్థిరపరిచేందుకు అల్- అహ్వామియహ్ లో వీధి లైట్ స్తంభాలపై నల్లని జెండాలు కట్టాడు. తీవ్రవాదులకు మద్దతుగా ఆ వ్యక్తి చేసిన చర్యల పట్ల కోర్ట్ ఆ నేరస్తుడికి మరణ శిక్షను జారీ చేయాలని నిర్ణయించింది.అంతకుముందు రియాద్ ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ ఖ్ఆతిఫ్ మరియు అల్- అహ్వామియహ్ లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా పలువురు తీవ్రవాదులు వ్యతిరేకంగా తీర్పులు జారీ కాబడ్డాయి.
తాజా వార్తలు
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం









