నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సోదరి
- May 01, 2017
భారత తొలి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సోదరి, సంగీత దర్శకురాలు ఏఆర్ రెహానా యోగి అండ్ పార్టనర్స్ బ్యానర్పై నిర్మించి, సంగీతం సమకూర్చిన చిత్రం 'ఏన్డా తలైల ఎన్నై వెక్కల'. కొత్త దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కొత్త నటుడు అజార్, సంచితాశెట్టి హీరోహీరోయిన్లు. హాస్యనటుడు యోగిబాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆడియోను ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ చేతుల మీదుగా విడుదల చేయగా, తొలి సీడీని యువ సంగీత దర్శకుడు హిప్హాప్ ఆది అందుకున్నాడు. ఈ సందర్భంగా రెహానా మాట్లాడుతూ.. 'ఈ వేసవి కాలంలో తరచుగా వినిపించేమాట ఏనడా తలైల ఎన్నై వెక్కల అని. అందరూ తలకి నూనె పెట్టుకోండి, ఒంటికి మంచిది చెబు తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సమ్మర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చక్కని ఉపశమ నాన్ని కలిగిస్తుంది' అని నవ్వుతూ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత జీకే రెడ్డి, డ్యాన్స మాస్టర్ కళా, సింగపూర్ దీపర్, ఎడిటర్ సీఎస్ ప్రేమ్, హీరో అజార్, హీరోయిన్ సంచితాశెట్టి, సినిమాటోగ్రాఫర్ వంశీ దరన్, నటుడు జయరామ్ సతీమణి పార్వతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









