ఢిల్లీ లో కె.విశ్వనాథ్కు మరో గౌరవం
- May 01, 2017
కళాతపస్వి, దర్శకరుషి కె.విశ్వనాథ్కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. విజ్ఞాన్భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బుధవారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం వేదికపై ఆయన ప్రసంగిస్తారు. 1969లో ఈ అవార్డు ఇవ్వడం మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ పురస్కార గ్రహీతకూ ఈ అవకాశం దక్కలేదు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చొరవతో విశ్వనాథ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఐదు పదుల ఏళ్లనాటి సినీ ప్రస్థానం, తెలుగు సినీ పరిశ్రమకు చేసిన కృషిపై ఆయన మాట్లాడనున్నారు. ‘దాదాసాహెబ్ పురస్కార తొలి స్వీకర్త దేవికా రాణి మొదలుకొని మనోజ్ కుమార్ వరకు ఎవరూ వేదికపై ప్రసంగించలేదు. తొలిసారిగా ఈ అవకాశం విశ్వనాథ్కు దక్కబోతోంది’అని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









