ఢిల్లీ లో కె.విశ్వనాథ్కు మరో గౌరవం
- May 01, 2017
కళాతపస్వి, దర్శకరుషి కె.విశ్వనాథ్కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. విజ్ఞాన్భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బుధవారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం వేదికపై ఆయన ప్రసంగిస్తారు. 1969లో ఈ అవార్డు ఇవ్వడం మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ పురస్కార గ్రహీతకూ ఈ అవకాశం దక్కలేదు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చొరవతో విశ్వనాథ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఐదు పదుల ఏళ్లనాటి సినీ ప్రస్థానం, తెలుగు సినీ పరిశ్రమకు చేసిన కృషిపై ఆయన మాట్లాడనున్నారు. ‘దాదాసాహెబ్ పురస్కార తొలి స్వీకర్త దేవికా రాణి మొదలుకొని మనోజ్ కుమార్ వరకు ఎవరూ వేదికపై ప్రసంగించలేదు. తొలిసారిగా ఈ అవకాశం విశ్వనాథ్కు దక్కబోతోంది’అని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









