ఢిల్లీ లో కె.విశ్వనాథ్‌కు మరో గౌరవం

- May 01, 2017 , by Maagulf
ఢిల్లీ లో కె.విశ్వనాథ్‌కు మరో గౌరవం

కళాతపస్వి, దర్శకరుషి కె.విశ్వనాథ్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా బుధవారం దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం వేదికపై ఆయన ప్రసంగిస్తారు. 1969లో ఈ అవార్డు ఇవ్వడం మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ పురస్కార గ్రహీతకూ ఈ అవకాశం దక్కలేదు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చొరవతో విశ్వనాథ్‌ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఐదు పదుల ఏళ్లనాటి సినీ ప్రస్థానం, తెలుగు సినీ పరిశ్రమకు చేసిన కృషిపై ఆయన మాట్లాడనున్నారు. ‘దాదాసాహెబ్‌ పురస్కార తొలి స్వీకర్త దేవికా రాణి మొదలుకొని మనోజ్‌ కుమార్‌ వరకు ఎవరూ వేదికపై ప్రసంగించలేదు. తొలిసారిగా ఈ అవకాశం విశ్వనాథ్‌కు దక్కబోతోంది’అని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com