వైమానిక దాడుల్లో 45మంది సామాన్యులు మృతి:పెంటగాన్ వెల్లడి

- May 02, 2017 , by Maagulf
వైమానిక దాడుల్లో 45మంది సామాన్యులు మృతి:పెంటగాన్ వెల్లడి

ఇస్లామిక్ ఉగ్రవాదులే లక్ష్యంగా మార్చి నెలలో చేపట్టిన వైమానిక దాడుల్లో 45మంది సామాన్యులు మరణించినట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ అధికారికంగా వెల్లడించింది. ఇరాక్, సిరియాలలోని ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వివరించింది. ఇరాక్ లోని మోసుల్ నగరంలో జరిగిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయినట్లు సంకీర్ణదళాల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. మోసుల్ నగరంలో జరిగిన వైమానిక దాడుల్లో వందమంది సామాన్యులు మరణించినట్లు స్థానికులు తెలిపారు. 
2014 నుంచి ఇప్పటివరకు ఇరాక్, సిరియాల్లో  చేసిన దాడుల్లో 352మంది మరణించినట్లు పెంటగాన్ చెపుతుండగా... ఈ వైమానిక దాడుల్లో 3వేలమందికి పైగా సామాన్య ప్రజలు మరణించారని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పరిశీలకులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com