మే 12న రిలీజ్ కాబోతున్న 'రక్షక భటుడు'
- May 02, 2017
ఈ మధ్య కాలంలో సినిమా ప్రేక్షకులలోకి సరికొత్త పంధాతో దూసుకొచ్చిన కథ అది, ఏ అంచనాలు లేకుండా వచ్చి ఇప్పుడు భారీ అంచనాల నడుమ నిలిచింది. అందుకే విడుదలకు ముందే తెలుగు ప్రేక్షకులు సైతం భారీ స్తాయిలో స్పందిస్తున్నారు. ఆ సినిమా నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టిజర్, ట్రైలర్ ని అత్యద్బుతంగా ఆధరించి మంచి మంచి కథలతో సినిమాలు నిర్మిస్తే మేము విజయాన్ని అందిస్తాం అని తెలుగు చిత్ర సీమకు మరో సారి తెలియజేసారు. అసలు ఇంతకి ఆ కథ ఏంటో, ఆ కథతో తెరకెక్కిన ఆ సినిమా ఏంటో తెలుసా...?
సుఖీభవ మూవీస్ బ్యానర్ పై ఏ గురు రాజ్ నిర్మించి, రక్ష, జక్కన్న ఫేం దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ రచించి దర్శకత్వం వహించిన సినిమా ‘’రక్షక భటుడు’’. పోలీస్ ని ఆంజనేయ స్వామి అవతారంలో మోస్ట్ పవర్ ఫుల్ గా చూపించి విడుదల చేసిన ఒక్క పోస్టర్ తోనే సిని ప్రేక్షకుల నుండి తారా స్థాయి అంచనాలను అందుకుంది రక్షక భటుడు టీం. బహుబలిని కట్టప్ప ఏందుకు చంపాడు అన్న స్థాయి లో, పోలీస్ గెటప్ లో నటించిన ఆ స్టార్ హీరో ఏవరు అని ప్రేక్షకులు ఆరా తీయడం మొదలు పెట్టారు అంటే, ఈ సినిమా గురించి సిని మార్కెట్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.
ప్రధాన తారాగణంగా అందాల తార రిచాపనై మరియు (మరో స్టార్ హీరో) నటిస్తుండగా, బ్రహ్మానందం, సుప్రీత్, అదుర్స్ రఘు, చిత్రం శ్రీను, జ్యోతి, ధన్ రాజ్, రాం జగన్, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ, జ్యోతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మల్హార్ భట్ట్ కెమెరా మరియు శేఖర్ చంద్ర సంగీతం, అమర్ రెడ్డి ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
అయితే అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ రక్షక భటుడు మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్తాయి లో ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. దైవానికి దెయ్యానికి మధ్య నడిచే ఒక డిఫెరెంట్ కథగా ఇప్పటికే మనకు కనపడుతుంది, కాగ ఈ సినిమా టీం మాట్లాడుతూ మా సినిమాలో కామెడీ, ఏమోషణ్, యాక్షన్, సెంటిమెంట్, లవ్ ని సమపాళల్లో మేళవించి తెరకెక్కించిన పూర్తీ స్థాయి మాస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకొచ్చారు. ఆంజనేయ స్వామి పోరాట యోధుడిగా ఎందుకు మారాడు?, అసలు ఆ ఆంజనేయ స్వామి గెటప్ లో ఉన్న స్టార్ హీరో ఏవరు.? ఇంత కొత్తగా తెరకెక్కిన అసలు ఈ సినిమా వెనక దాగిన మెయిన్ కథ ఏంటి అని ప్రేక్షకులలో రేకెత్తిన ప్రతి ప్రశ్న కి మే 12 న విజువల్ గా సమాధానం దొరకనుంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









