జూన్ లో వీడెవడు
- May 02, 2017
సచిన్ హీరోగా భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వంలో వై కింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థపై రైనా జోషి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వీడెవడు’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే సమయంలో హీరోయిన్ను ఎవరు చంపారో తెలుసుకోవాలనే ఆసక్తినీ కలిగించింది. ఈ మర్డర్ మిస్టరీ చిక్కుముడి జూన్లో వీడనుంది. ఎందుకంటే... ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ – ‘‘సచిన్ కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నారు. గాళ్ ఫ్రెండ్ను చంపాడనే ఆరోపణ మీద పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేస్తారు. హీరో గాళ్ఫ్రెండ్ పాత్రలో హిందీ హీరోయిన్ ఈషా గుప్తా నటించారు. సినిమాలో సస్పెన్స్ అండ్ థ్రిల్తో పాటు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. జూన్లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
ప్రభు, కిషోర్, సుప్రీత్, శ్రీనివాస్రెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, హర్షవర్థన్, ధన్య బాలకృష్ణన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్, ఎడిటింగ్: ప్రవీణ్పూడి, ఆర్ట్: కులకర్ణి, ఫైట్స్: కనల్ కణ్ణన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి, కొరియోగ్రఫీ: సీజర్, జానీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివప్రసాద్ గుడిమిట్ల, సంగీతం: ఎస్.ఎస్. తమన్, నిర్మాత: రైనా జోషి, కథ–స్క్రీన్ప్లే–దర్శకత్వం: తాతినేని సత్య.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









