ఇండియన్ శారీ, ఐడల్ వేర్ ఈవెంట్
- May 02, 2017
మస్కట్: సుల్తానేట్లో ఇండియా అంబాసిడర్ సుష్మా పాండే, ఇండియన్ ఎథ్నిక్ శారీ మరియు బ్రైడల్ వేర్ షోను ఏర్పాటు చేశారు. మస్కట్లోని ఇండియన్ ఎంబసీ వద్ద ఈ ఈవెంట్ జరిగింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శారీకి వున్న ప్రాధాన్యతను ఈ సందర్బంగా ఆమె వివరించారు. అలాగే ఇండియన్ బ్రైడల్ వేర్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని ఆమె తెలియజేశారు. ఆరు గజాల చీర, కంఫర్ట్కి పెట్టింది పేరనీ, చీరలో ఉండే అందం ఇంకెక్కడా ఉండదని వివిధ దేశాలకు చెందిన మహిళలే చెబుతుంటారని ఆమె అన్నారు. చీరకట్టులో ఎన్నెన్నో రకాలున్నాయనీ, ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కట్టే చీర మహిళలకు సరికొత్త అందాన్నిస్తుందని చెప్పారు సుష్మా పాండే. ప్రస్తుత మోడ్రన్ ట్రెండ్లోనూ శారీ సరికొత్తగా మహిళల అందాన్ని పెంచుతోందనీ, శారీ రూపకల్పనలో విప్లవాత్మక మార్పులే కాకుండా, వివిధ ట్రెండ్స్తో శారీని సరికొత్తగా డిజైన్ చేయడం కూడా జరుగుతోందని ఆమె వెల్లడించారు. లులు హైపర్ మార్కెట్ నుంచి సేకరించిన ఎథ్నిక్ శారీ కలెక్షన్ ఎగ్జిబిషన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు మహిళలు, అలాగే డిప్లమాట్స్ సతీమణులు, ఒమనీ బిజినెస్ విమెన్, మినిస్ట్రీలకు చెందిన పలువురు మహిళలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









