ఇండియన్ శారీ, ఐడల్ వేర్ ఈవెంట్
- May 02, 2017
మస్కట్: సుల్తానేట్లో ఇండియా అంబాసిడర్ సుష్మా పాండే, ఇండియన్ ఎథ్నిక్ శారీ మరియు బ్రైడల్ వేర్ షోను ఏర్పాటు చేశారు. మస్కట్లోని ఇండియన్ ఎంబసీ వద్ద ఈ ఈవెంట్ జరిగింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శారీకి వున్న ప్రాధాన్యతను ఈ సందర్బంగా ఆమె వివరించారు. అలాగే ఇండియన్ బ్రైడల్ వేర్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని ఆమె తెలియజేశారు. ఆరు గజాల చీర, కంఫర్ట్కి పెట్టింది పేరనీ, చీరలో ఉండే అందం ఇంకెక్కడా ఉండదని వివిధ దేశాలకు చెందిన మహిళలే చెబుతుంటారని ఆమె అన్నారు. చీరకట్టులో ఎన్నెన్నో రకాలున్నాయనీ, ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కట్టే చీర మహిళలకు సరికొత్త అందాన్నిస్తుందని చెప్పారు సుష్మా పాండే. ప్రస్తుత మోడ్రన్ ట్రెండ్లోనూ శారీ సరికొత్తగా మహిళల అందాన్ని పెంచుతోందనీ, శారీ రూపకల్పనలో విప్లవాత్మక మార్పులే కాకుండా, వివిధ ట్రెండ్స్తో శారీని సరికొత్తగా డిజైన్ చేయడం కూడా జరుగుతోందని ఆమె వెల్లడించారు. లులు హైపర్ మార్కెట్ నుంచి సేకరించిన ఎథ్నిక్ శారీ కలెక్షన్ ఎగ్జిబిషన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు మహిళలు, అలాగే డిప్లమాట్స్ సతీమణులు, ఒమనీ బిజినెస్ విమెన్, మినిస్ట్రీలకు చెందిన పలువురు మహిళలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









