ఇండియన్ శారీ, ఐడల్ వేర్ ఈవెంట్
- May 02, 2017
మస్కట్: సుల్తానేట్లో ఇండియా అంబాసిడర్ సుష్మా పాండే, ఇండియన్ ఎథ్నిక్ శారీ మరియు బ్రైడల్ వేర్ షోను ఏర్పాటు చేశారు. మస్కట్లోని ఇండియన్ ఎంబసీ వద్ద ఈ ఈవెంట్ జరిగింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శారీకి వున్న ప్రాధాన్యతను ఈ సందర్బంగా ఆమె వివరించారు. అలాగే ఇండియన్ బ్రైడల్ వేర్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని ఆమె తెలియజేశారు. ఆరు గజాల చీర, కంఫర్ట్కి పెట్టింది పేరనీ, చీరలో ఉండే అందం ఇంకెక్కడా ఉండదని వివిధ దేశాలకు చెందిన మహిళలే చెబుతుంటారని ఆమె అన్నారు. చీరకట్టులో ఎన్నెన్నో రకాలున్నాయనీ, ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కట్టే చీర మహిళలకు సరికొత్త అందాన్నిస్తుందని చెప్పారు సుష్మా పాండే. ప్రస్తుత మోడ్రన్ ట్రెండ్లోనూ శారీ సరికొత్తగా మహిళల అందాన్ని పెంచుతోందనీ, శారీ రూపకల్పనలో విప్లవాత్మక మార్పులే కాకుండా, వివిధ ట్రెండ్స్తో శారీని సరికొత్తగా డిజైన్ చేయడం కూడా జరుగుతోందని ఆమె వెల్లడించారు. లులు హైపర్ మార్కెట్ నుంచి సేకరించిన ఎథ్నిక్ శారీ కలెక్షన్ ఎగ్జిబిషన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు మహిళలు, అలాగే డిప్లమాట్స్ సతీమణులు, ఒమనీ బిజినెస్ విమెన్, మినిస్ట్రీలకు చెందిన పలువురు మహిళలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







