దసరాకు ప్రత్యేక బస్సులు వచ్చేస్తున్నాయి
- October 04, 2015
దసరా ప్రత్యేక బస్సులు వచ్చేస్తున్నాయి. కొత్తగా వచ్చేదేమీ లేదు. ఈఏడాది దసరా సీజన్లోనూ పాత బస్సులే నడుస్తాయి. సిటీల్లో కొన్నింటినీ, పల్లెవెలుగులు, సాధారణ ఎక్స్ప్రెస్ల్లో మరికొన్నింటిని తొలగించి వీటినే దసరా ప్రత్యేక సర్వీసులుగా నిర్వహించాలని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా విశాఖ-విజయవాడ మధ్య భవానీ భక్తుల కోసం దాదాపు వంద ప్రత్యేక బస్సులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది దసరా సెలవుల్లో నడిచే బస్సుల కంటే భవానీ భక్తులే అధిక సంఖ్యలో జిల్లా నుంచి తరలివెళ్ళారు. దీంతో ఈసారి భవానీ భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. సోమవారం ఉదయం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధీశ్కుమార్ అధ్యక్షతన జిల్లాలో పది డిపోల అధికారులు, డివిఎంలతో సమీక్ష జరగనుంది. దసరా సెలవుల్లోనూ, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం కనీసం వంద బస్సులను అందుబాటులోకి తేవడంపై చర్చిస్తారు. ముందుగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం, బృందాలుగా వచ్చే భవానీ భక్తుల కోసం కొన్నిబస్సులు కేటాయించనున్నారు. దసరా సెలవులు మొదలయ్యే సరికి ముఖ్యంగా విశాఖ నుంచి విజయనగరం, పార్వతీపురం, సాలూరు, శ్రీకాకుళం, పలాస, పాలకొండ, రాజాం, నరసన్నపేట దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అలాగే విశాఖ నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, తిరుపతి, ఖమ్మం, కర్నూలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ఈనెల 22వతేదీన దసరా పండుగ కావడంతో ఇది ముగిసిన తరువాత రెండు రోజులపాటు బస్సులు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







