సిరియా శరణార్థి శిబిరంపై ఐసిస్ ఆత్మాహుతి దాడి 32మంది పౌరులు మరణం

- May 02, 2017 , by Maagulf
సిరియా శరణార్థి శిబిరంపై ఐసిస్ ఆత్మాహుతి దాడి 32మంది పౌరులు మరణం

సిరియా శరణార్థ శిబిరంపై ఐసిస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 32మంది పౌరులు మరణించారు. మూడొందల కుటుంబాలు నివసిస్తున్న ఈ తాత్కాలిక శిబిరంపై మంగళవారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈశాన్య సిరియాలో ఎస్‌డిఎఫ్ ఆధీనంలో ఉన్న హసాకే పట్టణంలోకి ప్రవేశించేందుకు వీలుగా వీరికి ఈ శిబిరంలో ఆశ్రయం కల్పించారు. ఈ శిబిరంలోపలా, వెలుపలా మొత్తం ఐదుసార్లు ఆత్మాహుతి దాడులు జరిగాయని సిరియా మానవ హక్కుల విభాగం తెలిపింది. ఈ దాడి జరిగిన వెంటనే ఐసిస్-ఎస్‌డిఎఫ్ దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయని, మృతుల్లో 21మంది సిరియా లేదా ఇరాక్ శరణార్థు తెలిపింది. గాయపడిన 30మందిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టూ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com