సిరియా శరణార్థి శిబిరంపై ఐసిస్ ఆత్మాహుతి దాడి 32మంది పౌరులు మరణం
- May 02, 2017
సిరియా శరణార్థ శిబిరంపై ఐసిస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 32మంది పౌరులు మరణించారు. మూడొందల కుటుంబాలు నివసిస్తున్న ఈ తాత్కాలిక శిబిరంపై మంగళవారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈశాన్య సిరియాలో ఎస్డిఎఫ్ ఆధీనంలో ఉన్న హసాకే పట్టణంలోకి ప్రవేశించేందుకు వీలుగా వీరికి ఈ శిబిరంలో ఆశ్రయం కల్పించారు. ఈ శిబిరంలోపలా, వెలుపలా మొత్తం ఐదుసార్లు ఆత్మాహుతి దాడులు జరిగాయని సిరియా మానవ హక్కుల విభాగం తెలిపింది. ఈ దాడి జరిగిన వెంటనే ఐసిస్-ఎస్డిఎఫ్ దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయని, మృతుల్లో 21మంది సిరియా లేదా ఇరాక్ శరణార్థు తెలిపింది. గాయపడిన 30మందిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టూ వెల్లడించింది.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









