మరో సారి మంచి మనసు చాటుకొన్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్
- May 03, 2017
నందమూరి కళ్యాణ్ రామ్ మే 28 యూఎస్ లో జరగనున్న తానా సభలకు నిర్వాహకులనుంచి ఆహ్వానం అందుకొన్నారు. కల్యాణ్ రామ్ అక్కడ స్థానికంగా తానా అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. కాగా వేడుకకు కళ్యాణ్ రామ్ తో పాటు మరికొందరి సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. ఈ నేపద్యంలో కల్యాణ్ రామ్ తన మంచి మనసునుని చాటుకున్నాడు.. సాధారణంగా ఇలాంటి వేడుకలకు సెలబ్రేటీలను ఆహ్వానిస్తే నిర్వాహకులే సెలబ్రిటీల ప్రయాణ, బస ఖర్చులను భరించాల్సి ఉంది.. ఆ మొత్తం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో తానా సభ్యులు కూడా కళ్యాణ్ రామ్ కు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని చెప్పగా కళ్యాణ్ రామ్ మాత్రం వాళ్ళ ఆఫర్ ను తిరస్కరించారట. తన ఖర్చులన్నీ తానే పెట్టుకొని ఈ వేడుకలకు హాజరవుతానని.. చెప్పడమే కాదు... తన ఖర్చుల నిమిత్తం కేటాయించిన డబ్బుని అక్కడ స్థానికంగా చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం వినియోగించమని చెప్పాడట..
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









