మరో సారి మంచి మనసు చాటుకొన్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్

- May 03, 2017 , by Maagulf
మరో సారి మంచి మనసు చాటుకొన్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ మే 28 యూఎస్ లో జరగనున్న తానా సభలకు నిర్వాహకులనుంచి ఆహ్వానం అందుకొన్నారు. కల్యాణ్ రామ్ అక్కడ స్థానికంగా తానా అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. కాగా వేడుకకు కళ్యాణ్ రామ్ తో పాటు మరికొందరి సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. ఈ నేపద్యంలో కల్యాణ్ రామ్ తన మంచి మనసునుని చాటుకున్నాడు.. సాధారణంగా ఇలాంటి వేడుకలకు సెలబ్రేటీలను ఆహ్వానిస్తే నిర్వాహకులే సెలబ్రిటీల ప్రయాణ, బస ఖర్చులను భరించాల్సి ఉంది.. ఆ మొత్తం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో తానా సభ్యులు కూడా కళ్యాణ్ రామ్ కు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని చెప్పగా కళ్యాణ్ రామ్ మాత్రం వాళ్ళ ఆఫర్ ను తిరస్కరించారట. తన ఖర్చులన్నీ తానే పెట్టుకొని ఈ వేడుకలకు హాజరవుతానని..  చెప్పడమే కాదు...  తన ఖర్చుల నిమిత్తం కేటాయించిన డబ్బుని అక్కడ స్థానికంగా చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం వినియోగించమని చెప్పాడట.. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com