హైదరాబాద్లో వీసా గడువు ముగిసిన విదేశీయుల అరెస్ట్
- May 03, 2017
వీసాల గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్లో అక్రమంగా ఉంటున్నవిదేశీయులపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం వేకువజామున దాడులు నిర్వహించి వీసా గడువు ముసిగిన 118 మంది విదేశీయులను గుర్తించారు. మెహదీపట్నం, టప్పాచబుత్ర, టోలీచౌకి, లంగర్హౌజ్, మంగళ్హాట్, గోల్కొండ ప్రాంతాల్లో 15 టాస్క్ఫోర్స్ బృందాలు ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించాయి. గుర్తించిన వారిలో సోమాలియా, యెమన్, నైజీరియా, ఖతార్, సౌదీ అరేబియా, అమెరికా దేశాల వారు ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









