కృష్ణానదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి
- October 04, 2015
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని నివాసంలో సాయంత్రం 5.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్పై నీతి ఆయోగ్ ఉప సంఘం నివేదికను చంద్రబాబు ప్రధానికి అందజేసే అవకాశం ఉంది. అలాగే, ఈనెల 22న ప్రధాని రాష్ట్ర పర్యటన, అమరావతి శంకుస్థాపనపైనా చర్చించనున్నారు. జల మార్గాల అభివృద్ధిపై.. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు స్థానిక విజ్ఞాన్ భవన్లో జరగనున్న సాగరమాల అత్యున్నత కమిటీ భేటీలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు ఏపీలో జల మార్గాల అభివృద్ధి, 4వ నెంబరు జాతీయ జలమార్గం కాకినాడ-పుదుచ్చేరి పునర్నిర్మాణం తదితర అంశాలపై ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథార్టీ ఛైర్మన్ అమితాబ్ వర్మ చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అమరావతి నిర్మాణం కృష్ణానది అభిముఖంగా జరగనుండటంతో దాదాపు 30 కిలోమీటర్ల మేర కృష్ణానదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి యోచిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను వాటర్వేస్ అథార్టీ పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









