కృష్ణానదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి

- October 04, 2015 , by Maagulf
కృష్ణానదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని నివాసంలో సాయంత్రం 5.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌పై నీతి ఆయోగ్‌ ఉప సంఘం నివేదికను చంద్రబాబు ప్రధానికి అందజేసే అవకాశం ఉంది. అలాగే, ఈనెల 22న ప్రధాని రాష్ట్ర పర్యటన, అమరావతి శంకుస్థాపనపైనా చర్చించనున్నారు. జల మార్గాల అభివృద్ధిపై.. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు స్థానిక విజ్ఞాన్‌ భవన్‌లో జరగనున్న సాగరమాల అత్యున్నత కమిటీ భేటీలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు ఏపీలో జల మార్గాల అభివృద్ధి, 4వ నెంబరు జాతీయ జలమార్గం కాకినాడ-పుదుచ్చేరి పునర్నిర్మాణం తదితర అంశాలపై ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథార్టీ ఛైర్మన్‌ అమితాబ్‌ వర్మ చంద్రబాబుకు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. అమరావతి నిర్మాణం కృష్ణానది అభిముఖంగా జరగనుండటంతో దాదాపు 30 కిలోమీటర్ల మేర కృష్ణానదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి యోచిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను వాటర్‌వేస్‌ అథార్టీ పరిశీలిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com