భారత్ లోని సాయుధ దళాలకు శుభవార్త
- May 03, 2017
సాయుధ దళాల ప్రధాన డిమాండుకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. వారికి వికలాంగ పింఛను చెల్లింపునకు పాత విధానమైన శాతాల వారీ లెక్కింపునే అనుసరించాలని నిర్ణయించింది. శ్రేణుల వారీగా లెక్కించాలని ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సును పక్కనపెట్టింది. వేతన శ్రేణులు, బ్రిగేడియర్ స్థాయి నుంచి పదోన్నతులు పొందిన వారికి వేతన భద్రత కల్పించడం తదితర సమస్యల పరిష్కారానికి కూడా సుముఖత తెలిపింది. 2016కు ముందున్న పింఛనుదార్లకు పింఛను చెల్లింపులో మార్పులుచేయడానికి కూడా అంగీకరించింది. 2016 జనవరి ఒకటి నుంచి ఇవి వర్తించేలా నిర్ణయం తీసుకుంది. నూతన సూత్రం ప్రకారం పింఛను చెల్లిస్తారు.
నూతన ఉక్కు విధానానికి ఆమోదం.. నూతన ఉక్కు విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2030 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ అవసరాల కోసం దేశంలో తయారయిన ఉక్కు ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఉక్కు ఉత్పత్తికి అవసరమయ్యే కోకింగ్ కోల్, ఇతర ఉత్పత్తుల దిగుమతులను క్రమేణా తగ్గించాలని పేర్కొంది. చిన్న, మధ్యతరహా ఉక్కు పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పించనుంది. పరిశోధనల కోసం ప్రత్యేకంగా స్టీల్రీసెర్చ్అండ్ టెక్నాలజీమిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేయనుంది.
బ్యాంకుల మొండి బకాయిల విషయమై ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







