ఈ ఏడాది భారీగా పెరిగిన వింబుల్డన్‌ ప్రైజ్‌ మనీ

- May 03, 2017 , by Maagulf
ఈ ఏడాది భారీగా పెరిగిన వింబుల్డన్‌ ప్రైజ్‌ మనీ

ఈ ఏడాది వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్ని ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. గత ఏడాది 28.1 మిలియన్ల పౌండ్లుగా వున్న మొత్తం ప్రైజ్‌మనీ ఈ సారి 31.6 మిలియన్ల పౌండ్లకు పెరిగింది. పురుషుల, మహిళ సింగిల్స్‌ విభాగంలో విజేతలకు 2.2మిలియన్ల పౌండ్లు ఇవ్వనున్నారు. ఈ టోర్నిలో తొలి రౌండ్‌లో నిష్క్రమించిన వారికి సైతం 35, 000 పౌండ్లు లభిస్తాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అదనం. ఈ ఏడాది జులై 3న వింబుల్డన్‌ టోర్ని ప్రారంభంకానుంది. 
జూన్‌ 20న షరపోవాపై నిర్ణయం 
రష్యా క్రీడాకారిణి షరపోవా వింబుల్టన్‌లో పాల్గొనడంపై జూన్‌ 20న నిర్ణయం తీసుకోనున్నారు. ఆరోజున వింబుల్డన్‌ నిర్వహకుల సమావేశం జరగనుంది. షరపోవాపై విధించిన 15 నెలల నిషేధం ఏప్రిల్‌తో ముగిసింది. దీంతో వింబుల్డన్‌లో ఆమెకు వైల్డ్‌ కార్డ్‌ ప్రవేశం లభించనుందని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com