ఈ ఏడాది భారీగా పెరిగిన వింబుల్డన్ ప్రైజ్ మనీ
- May 03, 2017
ఈ ఏడాది వింబుల్డన్ టెన్నిస్ టోర్ని ప్రైజ్మనీని భారీగా పెంచారు. గత ఏడాది 28.1 మిలియన్ల పౌండ్లుగా వున్న మొత్తం ప్రైజ్మనీ ఈ సారి 31.6 మిలియన్ల పౌండ్లకు పెరిగింది. పురుషుల, మహిళ సింగిల్స్ విభాగంలో విజేతలకు 2.2మిలియన్ల పౌండ్లు ఇవ్వనున్నారు. ఈ టోర్నిలో తొలి రౌండ్లో నిష్క్రమించిన వారికి సైతం 35, 000 పౌండ్లు లభిస్తాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అదనం. ఈ ఏడాది జులై 3న వింబుల్డన్ టోర్ని ప్రారంభంకానుంది.
జూన్ 20న షరపోవాపై నిర్ణయం
రష్యా క్రీడాకారిణి షరపోవా వింబుల్టన్లో పాల్గొనడంపై జూన్ 20న నిర్ణయం తీసుకోనున్నారు. ఆరోజున వింబుల్డన్ నిర్వహకుల సమావేశం జరగనుంది. షరపోవాపై విధించిన 15 నెలల నిషేధం ఏప్రిల్తో ముగిసింది. దీంతో వింబుల్డన్లో ఆమెకు వైల్డ్ కార్డ్ ప్రవేశం లభించనుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









