మనోజ్‌, శింబు జతగా ఓ యాక్షన్‌ సినిమా

- May 03, 2017 , by Maagulf
మనోజ్‌, శింబు జతగా ఓ యాక్షన్‌ సినిమా

మాజీ ప్రేమికులు శింబు, నయనతార చాలా గ్యాప్‌ తర్వాత కలసి నటించిన తమిళ చిత్రం ‘ఇదు నమ్మ ఆళ్‌’. పాండిరాజ్‌ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్‌ ఫిలింస్‌ పతాకాలపై టి.రాజేందర్‌ నిర్మించిన ఈ సినిమా ‘సరసుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. శింబు సోదరుడు టి.ఆర్‌. కురళ అరసన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్‌ సీడీని హీరో మంచు మనోజ్‌ ఆవిష్కరించగా, ఆడియో సీడీలను టి.రాజేందర్‌ రిలీజ్‌ చేశారు.  టి.రాజేందర్‌ మాట్లాడుతూ– ‘‘1983లో విడుదలైన ‘ప్రేమసాగరం’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తర్వాత నా చిత్రాలను, నా కొడుకు శింబు చిత్రాలను కూడా పెద్ద హిట్‌ చేశారు.
ఈ చిత్రం ద్వారా శింబు తన తమ్ముణ్ణి సంగీత దర్శకుణ్ణి చేశాడు. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను, శింబు ప్రాణ స్నేహితులం. నాకు మ్యూజిక్‌లో కొంత టేస్ట్‌ ఉందంటే కారణం శింబూయే. నేను, శింబు కలిసి ఓ యాక్షన్‌ సినిమా చేయబోతున్నాం. శింబు కథ తయారు చేస్తున్నాడు’’ అని మంచు మనోజ్‌ అన్నారు. ‘‘తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులున్నా, మనోజ్‌ నా ప్రాణ స్నేహితుడు. తెలుగులో నా సినిమా విడుదలై చాలా రోజులైంది. పాండిరాజ్‌ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు శింబు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్‌: శ్రీమతి ఉషా రాజేందర్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com