మనోజ్, శింబు జతగా ఓ యాక్షన్ సినిమా
- May 03, 2017
మాజీ ప్రేమికులు శింబు, నయనతార చాలా గ్యాప్ తర్వాత కలసి నటించిన తమిళ చిత్రం ‘ఇదు నమ్మ ఆళ్’. పాండిరాజ్ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ శింబు సినీ ఆర్ట్స్, జేసన్రాజ్ ఫిలింస్ పతాకాలపై టి.రాజేందర్ నిర్మించిన ఈ సినిమా ‘సరసుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. శింబు సోదరుడు టి.ఆర్. కురళ అరసన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. బిగ్ సీడీని హీరో మంచు మనోజ్ ఆవిష్కరించగా, ఆడియో సీడీలను టి.రాజేందర్ రిలీజ్ చేశారు. టి.రాజేందర్ మాట్లాడుతూ– ‘‘1983లో విడుదలైన ‘ప్రేమసాగరం’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తర్వాత నా చిత్రాలను, నా కొడుకు శింబు చిత్రాలను కూడా పెద్ద హిట్ చేశారు.
ఈ చిత్రం ద్వారా శింబు తన తమ్ముణ్ణి సంగీత దర్శకుణ్ణి చేశాడు. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను, శింబు ప్రాణ స్నేహితులం. నాకు మ్యూజిక్లో కొంత టేస్ట్ ఉందంటే కారణం శింబూయే. నేను, శింబు కలిసి ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నాం. శింబు కథ తయారు చేస్తున్నాడు’’ అని మంచు మనోజ్ అన్నారు. ‘‘తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులున్నా, మనోజ్ నా ప్రాణ స్నేహితుడు. తెలుగులో నా సినిమా విడుదలై చాలా రోజులైంది. పాండిరాజ్ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు శింబు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







