వచ్చే ఏడాది విజయవాడ గన్నవరం నుంచీ హజ్యాత్ర
- May 04, 2017
హజ్ యాత్రకు వెళ్లేవారి కోసం వచ్చే ఏడాది నుంచి విజయవాడ విమానాశ్రయంలోనూ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా హజ్ యాత్ర చేపట్టే అవకాశాల్లేవనీ, అందరూ హైదరాబాద్ మీదుగా రాకపోకలు చేయాల్సి వస్తోందనీ ముస్లింల ప్రతినిధి బృందం గురువారం వెంకయ్యను కలిసి నివేదించింది. ఏటా దాదాపు 3 వేల మంది ఏపీ నుంచి హజ్యాత్రకు వెళ్తారని వివరించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో వెంకయ్య మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవంతిని హజ్ యాత్రికుల రాకపోకల నిమిత్తం కేటాయించేలా చూడాలని కోరారు. ఈ ఏడాది యాత్రకు సమయం మించిపోయినందువల్ల వచ్చే ఏడాది నుంచి సదుపాయం అందుబాటులోకి వచ్చేలాచూస్తామని నఖ్వీ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









