వచ్చే ఏడాది విజయవాడ గన్నవరం నుంచీ హజ్యాత్ర
- May 04, 2017
హజ్ యాత్రకు వెళ్లేవారి కోసం వచ్చే ఏడాది నుంచి విజయవాడ విమానాశ్రయంలోనూ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా హజ్ యాత్ర చేపట్టే అవకాశాల్లేవనీ, అందరూ హైదరాబాద్ మీదుగా రాకపోకలు చేయాల్సి వస్తోందనీ ముస్లింల ప్రతినిధి బృందం గురువారం వెంకయ్యను కలిసి నివేదించింది. ఏటా దాదాపు 3 వేల మంది ఏపీ నుంచి హజ్యాత్రకు వెళ్తారని వివరించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో వెంకయ్య మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవంతిని హజ్ యాత్రికుల రాకపోకల నిమిత్తం కేటాయించేలా చూడాలని కోరారు. ఈ ఏడాది యాత్రకు సమయం మించిపోయినందువల్ల వచ్చే ఏడాది నుంచి సదుపాయం అందుబాటులోకి వచ్చేలాచూస్తామని నఖ్వీ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









