వచ్చే ఏడాది విజయవాడ గన్నవరం నుంచీ హజ్‌యాత్ర

- May 04, 2017 , by Maagulf
వచ్చే ఏడాది విజయవాడ గన్నవరం  నుంచీ హజ్‌యాత్ర

హజ్‌ యాత్రకు వెళ్లేవారి కోసం వచ్చే ఏడాది నుంచి విజయవాడ విమానాశ్రయంలోనూ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేరుగా హజ్‌ యాత్ర చేపట్టే అవకాశాల్లేవనీ, అందరూ హైదరాబాద్‌ మీదుగా రాకపోకలు చేయాల్సి వస్తోందనీ ముస్లింల ప్రతినిధి బృందం గురువారం వెంకయ్యను కలిసి నివేదించింది. ఏటా దాదాపు 3 వేల మంది ఏపీ నుంచి హజ్‌యాత్రకు వెళ్తారని వివరించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో వెంకయ్య మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయంలోని పాత టెర్మినల్‌ భవంతిని హజ్‌ యాత్రికుల రాకపోకల నిమిత్తం కేటాయించేలా చూడాలని కోరారు. ఈ ఏడాది యాత్రకు సమయం మించిపోయినందువల్ల వచ్చే ఏడాది నుంచి సదుపాయం అందుబాటులోకి వచ్చేలాచూస్తామని నఖ్వీ హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com