ఖతారీ జలాల్లోని చేపలతో ప్రమాదం లేదు
- May 06, 2017
మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్, ఖతారీ జలాల్లోని చేపల్లో టాక్సిక్ అవశేషాలున్నాయనీ, ఆ కారణంగా వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదనీ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. వివిధ మార్గాల్లో ఖతారీ జలాల్లోని చేపలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రజల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో కొన్ని చేపల్ని అలాగే ఖతారీ జలాల్నీ పరిశోధనకు పంపింది. ఆ పరిశోధన వివరాల్ని కూడా అధికారులు వివరించారు. ఖతారీ జలాల్లోని చేపలు పూర్తిగా సురక్షితమైనవని పేర్కొంటూ, ఎక్కడా ఎలాంటి టాక్సిక్ మెటీరియల్ జాడ కూడా పరిశోధనల్లో దొరకలేదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చేపల్ని తినాలనుకునేవారు నిరభ్యంతరంగా తినవచ్చునని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









