మోడీ మాత్రమే కాశ్మీర్ సమస్యను పరీక్షించగలరు
- May 06, 2017
ఏడు దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలేది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనంటూ సంచలన ప్రకటన చేశారు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి. గతంలో అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్.. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిలు ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్యం వహించడంతో.. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు ముఫ్తీ. గత ప్రధానులు పాకిస్తాన్కు వెళ్లాలనుకున్నా వెళ్లలేకపోయారని .. కానీ మోడీ మాత్రం లాహోర్కు వెళ్లి వచ్చారంటూ ప్రశంసించారు. ఈ మాట చెబుతున్నందుకు తనను అందరూ విమర్శించవచ్చని.. కానీ.. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి మోడీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ప్రజల మద్దతు ఉంటుందన్నారు మహబూబా ముఫ్రీ. జమ్మూలో ఓ ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









