కరాచీ నుండి ముంబై కి విమానాలు లేవు
- May 07, 2017
ఇస్లామాబాద్ : కరాచీ-ముంబయి మార్గంలో తిరిగే విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) తెలిపింది. వాణిజ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కరాచీ-ముంబయి మార్గంలో పీఐఏ వారంలో రెండు(సోమ, గురు) విమాన సర్వీసులను నడుపుతోంది. సోమవారం నుంచి వీటిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే లాహోర్-దిల్లీ మార్గంలో సర్వీసులు యథావిధిగా తిరుగుతాయని పీఐఏ తెలిపింది.
‘మే 8 నుంచి కరాచీ-ముంబయి మార్గంలో పీఐఏ విమాన సర్వీసులు తిరగవు. ఈ మార్గంలో బుకింగ్స్ కూడా నిలిపివేశాం.’ అని ఓ పీఐఏ అధికారి వెల్లడించారు. ఈ మార్గంలో తక్కువ ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వీసుల రద్దుతో లాహోర్-దిల్లీ మార్గంలో రద్దీ పెరుగుతోందని భావిస్తున్నారు.
గత ఆరు నెలలుగా ఈ మార్గంలో నష్టాల కారణంగా వీటిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ ఇస్తే తప్ప భవిష్యత్లో ఈ మార్గంలో విమానాలను తిప్పలేమని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల భారత్-పాక్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వస్తున్న వార్తలను పీఐఏ యాజమాన్యం ఖండించింది. కేవలం వాణిజ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకన్నామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







