ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన
- May 08, 2017
తెలుగు రాష్ట్రాలకు రానున్న 48 గంటల్లో పలు చోట్ల ఉరుములు, తీవ్రగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర వరకూ ద్రోణి ఏర్పడిందని...దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 5 సెం.మీ, విజయనగరంలో 3 సెం.మీ, డెంకాడ, వేపడ, పూసపాటిరేగ, తెర్లాంలో 2 సెం.మీ, విశాఖలో 3 సెం.మీ, అనంతపురం జిల్లా పెనుగొండలో 3 సెం.మీ, లేపాక్షిలో 2 సెం.మీ, కర్నూలు జిల్లా హోళగుందలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







