సౌదీ అరేబియాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న 24 మంది భారతీయులు
- May 08, 2017
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 24 మంది సౌదీ అరేబియాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏపీకి చెందిన పదిమంది, తెలంగాణకు చెందిన నలుగురు, ఒడిశాకు చెందిన పదిమంది సాయం కోసం అర్థిస్తున్నారు.
ఓ ఏజెంట్ ద్వారా వారు సౌదీకి వెళ్లారు. అతను వారిని మోసం చేశాడని ఆలస్యంగా గుర్తించారు. కంపెనీ కూడా వారిని పట్టించుకోలేదు. దీంతో వారు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో బాధితులు ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. వారు తెలంగాణ ఎన్నారై అఫైర్స్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సందేశం పంపించారు. వారు తమ ఇబ్బందులు వెల్లడించి, సాయం కోరారు. వారికి సాయం చేసేందుకు మంత్రి కేటీ రామారావు వారి కాంటాక్ట్ నెంబర్ అడిగారు.
తమకు తినేందుకు ఆహారం లేదని, తాము రోడ్ల పైన బతుకును వెళ్లదీస్తున్నామని, తాము ప్రమాదక పరిస్థితుల్లో ఇక్కడ పని చేస్తున్నామని, తమను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వారు మంత్రికి తమ ఇబ్బందలను వివరించారు. తాము రియాద్కు ఎలా వచ్చాం, ఎలా తిరిగి రాలేకపోతున్నామో వెల్లడించారు.
బాధితులు అక్టోబర్ 2016లో ఓ ఏజెంట్ ద్వారా రియాద్ వెళ్లారు. అక్కడ వారికి వివిధ నిర్మాణ కంపెనీలలో ఉద్యోగం కల్పించారు. కానీ అక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేవు. పరిస్థితి దారుణంగా ఉంది. వారికి సరైన ఆహారం కూడా అందించలేదు.
అంతేకాదు, వారికి అక్కడ కల్పించే ఇకామా అంటే ఐడెంటిటీ కూడా కల్పించలేదు. అది ఇస్తే వారు అక్కడ చట్టబద్దంగా పని చేస్తున్నట్లు ఉంటుంది. కానీ ఐడెంటిటీ లేని పరిస్థితుల్లో పని చేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన ఇండియన్ ఎంబసీ వారికి సాయం చేసేందుకు సిద్ధపడింది. అప్పుడు వారు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం హఠాత్తుగా.. ఏప్రిల్ 9న వారికి ఐడెంటిటీ ఇచ్చింది. తద్వారా వారిని వెళ్లనీయకుండా అలా చేసింది.
ఏప్రిల్ 14న వారు ఎంబసీకి సమాచారం పంపించారు. తమకు ఐడెంటిటీ ఇచ్చారని, తాము కంపెనీలోనే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!









