కేవలం రూ.899కే ఇండిగో విమాన టికెట్
- May 08, 2017
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ‘సమ్మర్ స్పెషల్ సేల్’ ఆఫర్ను ప్రకటించింది. దేశీయంగా నడిచే ఇండిగో విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రారంభ ధర రూ.899లకే టికెట్ పొందవచ్చు. మే 8 నుంచి మే 10వ తేదీ వరకూ ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్లు బుక్చేసుకోవచ్చని ఇండిగో తెలిపింది. ముంబయి-గోవా, అహ్మదాబాద్- ముంబయి, చెన్నై-పోర్ట్ బ్లెయిర్, గువహటి- హైదరాబాద్, ముంబయి-గువహటి, జమ్మూ-అమృత్సర్, దిల్లీ-ఉదయ్పూర్, కోల్కతా-అగర్తలా తదితర రూట్లలో ఇండిగో ఈ సదుపాయాన్ని కల్పించింది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇక చెన్నై నుంచి 14 మార్గాలకు ప్రత్యేక ధరలను కూడా ప్రకటించింది. వీటిలో హైదరాబాద్కు రూ.1,399, విశాఖపట్నానికి రూ.1,099లకే టికెట్ అందించనుంది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









