కేవలం రూ.899కే ఇండిగో విమాన టికెట్
- May 08, 2017
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ‘సమ్మర్ స్పెషల్ సేల్’ ఆఫర్ను ప్రకటించింది. దేశీయంగా నడిచే ఇండిగో విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రారంభ ధర రూ.899లకే టికెట్ పొందవచ్చు. మే 8 నుంచి మే 10వ తేదీ వరకూ ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్లు బుక్చేసుకోవచ్చని ఇండిగో తెలిపింది. ముంబయి-గోవా, అహ్మదాబాద్- ముంబయి, చెన్నై-పోర్ట్ బ్లెయిర్, గువహటి- హైదరాబాద్, ముంబయి-గువహటి, జమ్మూ-అమృత్సర్, దిల్లీ-ఉదయ్పూర్, కోల్కతా-అగర్తలా తదితర రూట్లలో ఇండిగో ఈ సదుపాయాన్ని కల్పించింది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇక చెన్నై నుంచి 14 మార్గాలకు ప్రత్యేక ధరలను కూడా ప్రకటించింది. వీటిలో హైదరాబాద్కు రూ.1,399, విశాఖపట్నానికి రూ.1,099లకే టికెట్ అందించనుంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







