ఏపీ మంత్రి నారాయణ కొడుకు మృతి, కారు నుజ్జునుజ్జు..
- May 09, 2017
ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ యాక్సిడెంట్లో చనిపోయాడు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నిషిత్ ప్రయాణిస్తున్న బెంజ్ కారు మెట్రో స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రి నారాయణ కొడుకు నిషిత్, అతడి ఫ్రెండ్ రాజా రవివర్మ వున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఇద్దరినీ అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు బెంజ్ కారు(టిఎస్ 07ఎస్కే 7117)లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తీవ్రంగా గాయపడ్డారు.
బుధవారం ఉదయం మూడు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్ పర్యటనలోవున్న మంత్రి నారాయణ కొడుకు మరణవార్త విని షాక్కు గురయ్యారు. 22 ఏళ్ల నిషిత్.. నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. అతివేగం, సీటు బెల్టు ధరించక పోవడంతో కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నమాట. పోస్టు మార్టం తర్వాత నిషిత్ మృతదేహాన్ని జూబ్లిహిల్స్లోని నారాయణ నివాసానికి తీసుకెళ్ల నున్నారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరు తరలిస్తారు. ఇటు లండన్ పర్యటనలోవున్న నారాయణ ఈ సాయంత్రం 8 గంటలకు చెన్నై చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన నెల్లూరు పయనమవుతారు. గురువారం ఉదయం నెల్లూరులో నిషిత్ నారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







