సబ్సిడీ ఎత్తివేతతో కుదేలైన మీట్‌ మార్కెట్‌

- October 05, 2015 , by Maagulf
సబ్సిడీ ఎత్తివేతతో కుదేలైన మీట్‌ మార్కెట్‌

మార్కెట్‌లో మీట్‌ అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మీట్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో మార్కెట్‌లో అమాంతం మీట్‌ ధరలు పెరిగిపోయాయి. ఒక్క బహ్రెయినీ దినార్‌కే కిలో మీట్‌ ఐదు రోజుల క్రితం లభిస్తే, దాని ధర ఇప్పుడు 3.2 బహ్రెయినీ దినార్‌లకు చేరుకుందనీ, దాంతో వినియోగదారులు మీట్‌ని కొనడానికి రావడంలేదని వ్యాపారులు చెప్పారు. 50 రోజులుగా మీట్‌ వ్యాపారం చేస్తున్న అబు జాబర్‌, ప్రతిజూ 15 నుంచి 20 గొర్రెలను కొనుగోలు చేసేవాడిననీ, ఇప్పుడు 2 నుంచి మూడు గొర్రెల్ని మాత్రమే తీసుకొచ్చాననీ, వాటి మాంసం కూడా మిగిలిపోతోందని చెప్పాడు. చికెన్‌ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఆవు మాంసం ధర కూడా అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. వ్యాపారుల ఈ సంక్షోభం నుంచి బయటపడెదెలా? అని ఆవేదన చెందుతున్నారు. పాలకులు కల్పించుకుని, సమస్యకు పరిష్కారం వెతకాలని వ్యాపారులు కోరుతున్నారు.

 

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com