నేడు శ్రీలంకకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ
- May 10, 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం శ్రీలంకకు బయలుదేరనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్ (సింహళీయుల బుద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించే ఈ వేడుకలకు వంద దేశాల నుంచి 400 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారు. బౌద్ధుల కాలమాని(కేలండర్) ప్రకారం వేసక్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. బుద్ధుని పుట్టుక, జ్ఞానోదయం, నిర్వాణాలకు సంబంధించిన అంశాలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడతారు. మోదీ తన పర్యటన సందర్భంగా శ్రీలంక నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల (హిందూ మహాసముద్ర ప్రాంత) సంయుక్త కార్యదర్శి సంజయ్ పాండా తెలిపారు. అయితే, ఇవి సాధారణ భేటీలేనని స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగానే శ్రీలంకలోని తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన కేండీ ప్రాంతాన్ని మోదీ సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









