నేడు శ్రీలంకకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ

- May 10, 2017 , by Maagulf
నేడు శ్రీలంకకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం శ్రీలంకకు బయలుదేరనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్‌ (సింహళీయుల బుద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించే ఈ వేడుకలకు వంద దేశాల నుంచి 400 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారు. బౌద్ధుల కాలమాని(కేలండర్‌) ప్రకారం వేసక్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. బుద్ధుని పుట్టుక, జ్ఞానోదయం, నిర్వాణాలకు సంబంధించిన అంశాలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడతారు. మోదీ తన పర్యటన సందర్భంగా శ్రీలంక నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల (హిందూ మహాసముద్ర ప్రాంత) సంయుక్త కార్యదర్శి సంజయ్‌ పాండా తెలిపారు. అయితే, ఇవి సాధారణ భేటీలేనని స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగానే శ్రీలంకలోని తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన కేండీ ప్రాంతాన్ని మోదీ సందర్శించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com