నేడు శ్రీలంకకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ
- May 10, 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం శ్రీలంకకు బయలుదేరనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్ (సింహళీయుల బుద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించే ఈ వేడుకలకు వంద దేశాల నుంచి 400 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారు. బౌద్ధుల కాలమాని(కేలండర్) ప్రకారం వేసక్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. బుద్ధుని పుట్టుక, జ్ఞానోదయం, నిర్వాణాలకు సంబంధించిన అంశాలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడతారు. మోదీ తన పర్యటన సందర్భంగా శ్రీలంక నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల (హిందూ మహాసముద్ర ప్రాంత) సంయుక్త కార్యదర్శి సంజయ్ పాండా తెలిపారు. అయితే, ఇవి సాధారణ భేటీలేనని స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగానే శ్రీలంకలోని తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన కేండీ ప్రాంతాన్ని మోదీ సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









