నేడు శ్రీలంకకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ
- May 10, 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం శ్రీలంకకు బయలుదేరనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్ (సింహళీయుల బుద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించే ఈ వేడుకలకు వంద దేశాల నుంచి 400 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారు. బౌద్ధుల కాలమాని(కేలండర్) ప్రకారం వేసక్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. బుద్ధుని పుట్టుక, జ్ఞానోదయం, నిర్వాణాలకు సంబంధించిన అంశాలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడతారు. మోదీ తన పర్యటన సందర్భంగా శ్రీలంక నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల (హిందూ మహాసముద్ర ప్రాంత) సంయుక్త కార్యదర్శి సంజయ్ పాండా తెలిపారు. అయితే, ఇవి సాధారణ భేటీలేనని స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగానే శ్రీలంకలోని తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన కేండీ ప్రాంతాన్ని మోదీ సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







