ఏ క్షణమైనా అగ్రరాజ్యం అమెరికాపై అణుదాడికి సిద్ధమే ఉత్తర కొరియా
- May 11, 2017
అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతోంది ఉత్తరకొరియా. అమెరికాపై హెచ్చరికలు చేస్తూ మరోసారి దుస్సాహసానికిపాల్పడింది. అణుబాంబుతో దాడిచేస్తే అమెరికాలో కోట్ల మంది ప్రజలు మరణిస్తారని తాజాగా హెచ్చరికలు చేసింది.
ఉత్తరకొరియా అధికార ప్రతినిధి రోడాంగ్ సిన్మన్ ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాపై ఏ క్షణంలోనైనా అణుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఉ.కొరియా నుంచి ప్రకటన ఇటీవల జరిపిన డ్రిల్ యుద్ధానికి ప్రారంభం లాంటిది. అమెరికా పూర్తిగా నాశనం అవుతుంది. యుద్ధం జరిగితే.. కోట్ల మంది అమెరికన్లు అణుదాడిలో మరణిస్తారు. ఆ దేశ స్వరూపమే మారిపోతుంది. అమెరికాలో ప్రాణాలతో మిగిలిన వారికి కనీసం షెల్టర్ కూడా దొరకదు. ఇకనైనా అమెరికా.. దక్షిణకొరియాలో ఉన్న వారి భద్రత గురించి ఆలోచించడం మాని, తమ దేశంలోని ప్రజలను ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అని ప్రకటనలో పేర్కొంది.
ఇక ఉ.కొరియాకు చెందిన మరో మీడియాలో.. యుద్ధవినాశనం నుంచి తప్పించుకోవాలంటే అమెరికాకు ఒకే ఒక్క దారి ఉంది. దక్షిణకొరియా నుంచి వారి మిలిటరీని, ప్రజలను స్వదేశానికి తీసుకెళ్లాలి అని పేర్కొంది.ఉ.కొరియా చర్యలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణకొరియాలో తమ మిలిటరీ బలగాలను సిద్ధం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచరులు కొరియా సరిహద్దులో పాగా వేశారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉ.కొరియా ఈ విధంగా హెచ్చరికలకు దిగింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







