విదేశాల నుంచి బంగారాన్ని చాక్లెట్ పెట్టెలో పసిడి రేకులు
- May 11, 2017
విదేశాల నుంచి బంగారాన్ని అడ్డదారిలో తరలించడానికి స్మగ్లర్లు ఎత్తుకుపైఎత్తు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రయాణికుడు బంగారాన్ని పలచని రేకుగా మార్చి చాక్లెట్ డబ్బాల అంచులో పెట్టి తరలిస్తూ అడ్డంగా దొరికాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తి గురువారం అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగాడు. 423 గ్రాముల పసిడిని పలుచని రేకులుగా మార్చి.. వాటిని రెండు చాక్లెట్ బాక్సుల్లో.. ఓ ఫేస్క్రీమ్ బాక్సు లోపలి భాగం అంచులో దాచాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. చాక్లెట్ బాక్సులు, ఫేస్క్రీమ్ బాక్సులో బంగారు రేకులను గుర్తించారు.దాదాపు రూ.12 లక్షల విలువైన బంగారు రేకులను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ కోసం నిందితుణ్ని కస్టమ్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









