వివాహంలో పెను విషాదం

- May 12, 2017 , by Maagulf
వివాహంలో పెను విషాదం

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో మ్యారేజ్ హాల్ గోడ కూలి 24 మంది మరణించారు.  బుధవారం నాడు జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.  ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు.  భారీ వర్షలకు నానిపోయిన 12 అడుగుల ఎత్తయిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో పెళ్లి జరుగుతోంది.  పెళ్లికి వచ్చిన అతిధులపై గోడ కూలిపోయింది.  కాగా కళ్యాణ మండపానికి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేదు.  ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వసుందరరాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండేసి లక్షలు రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేల ఆర్థిక సహాయం ఇస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com