వివాహంలో పెను విషాదం
- May 12, 2017
రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో మ్యారేజ్ హాల్ గోడ కూలి 24 మంది మరణించారు. బుధవారం నాడు జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. భారీ వర్షలకు నానిపోయిన 12 అడుగుల ఎత్తయిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో పెళ్లి జరుగుతోంది. పెళ్లికి వచ్చిన అతిధులపై గోడ కూలిపోయింది. కాగా కళ్యాణ మండపానికి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేదు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వసుందరరాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండేసి లక్షలు రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేల ఆర్థిక సహాయం ఇస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







