వివాహంలో పెను విషాదం
- May 12, 2017
రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో మ్యారేజ్ హాల్ గోడ కూలి 24 మంది మరణించారు. బుధవారం నాడు జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. భారీ వర్షలకు నానిపోయిన 12 అడుగుల ఎత్తయిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో పెళ్లి జరుగుతోంది. పెళ్లికి వచ్చిన అతిధులపై గోడ కూలిపోయింది. కాగా కళ్యాణ మండపానికి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేదు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వసుందరరాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండేసి లక్షలు రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేల ఆర్థిక సహాయం ఇస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









