రైల్లో ప్రయాణిస్తున్నారా? అయితే ఇకపై మీ క్రెడిట్ కార్డులు చెంతన పెట్టుకోవటం మరవకండి!

- May 12, 2017 , by Maagulf
రైల్లో ప్రయాణిస్తున్నారా? అయితే ఇకపై మీ క్రెడిట్ కార్డులు చెంతన పెట్టుకోవటం మరవకండి!

రైల్లో క్యాటరింగ్‌ సర్వీస్‌ను నగదు రహితంగా అమలు చేసేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. క్యాష్‌లెస్‌ విధానం ద్వారా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో తినుబండారాలు కొనుగోలు ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికుల నుంచి సేవా రుసుమును వసూలు చేయడం లేదు. దీని వల్ల ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం కోల్పోతున్నప్పటికీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే రీతిలో క్యాష్‌లెస్‌ పద్దతిలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో తినుబండారాలను క్రెడిట్‌ లేదా, డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 5శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని జూన్‌ 30 నుంచి అమలు చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com