రైల్లో ప్రయాణిస్తున్నారా? అయితే ఇకపై మీ క్రెడిట్ కార్డులు చెంతన పెట్టుకోవటం మరవకండి!
- May 12, 2017
రైల్లో క్యాటరింగ్ సర్వీస్ను నగదు రహితంగా అమలు చేసేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. క్యాష్లెస్ విధానం ద్వారా ఎక్స్ప్రెస్ రైళ్లలో తినుబండారాలు కొనుగోలు ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి సేవా రుసుమును వసూలు చేయడం లేదు. దీని వల్ల ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం కోల్పోతున్నప్పటికీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే రీతిలో క్యాష్లెస్ పద్దతిలో ఎక్స్ప్రెస్ రైళ్లలో తినుబండారాలను క్రెడిట్ లేదా, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 5శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని జూన్ 30 నుంచి అమలు చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









