ప్రొ కబడ్డీలో సచిన్ టెండూల్కర్
- May 12, 2017
- చెన్నై ప్రాంఛైజీలో సహ యజమాని
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడా లీగ్ల్లో వరుసగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఫుట్బాల్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్, బ్యాడ్మింటన్ లీగ్లో బెంగళూర్ బుల్స్ ప్రాంఛైజీలలో సచిన్ ఇప్పటికే యజమానిగా ఉన్నాడు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయిన గ్రామీణ క్రీడ ప్రొ కబడ్డీలోనూ సచిన్ తాజాగా పెట్టుబడులు పెట్టాడు!. ఈ ఏడాది నుంచి ప్రొ కబడ్డీలో కొత్త మరో నాల్గు జట్లు రానున్నాయి. వ్యాపారవేత్త ఎన్. ప్రసాద్తో కలిసి సచిన్ తమిళనాడు ప్రాంఛైజీని సొంతం చేసుకున్నాడు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ హర్యానా ప్రాంఛైజీ, ఆదానీ గ్రూప్ గుజరాత్ ప్రాంఛైజీ, జీఎంఆర్ గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రాంఛైజీలతో జట్లను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రొ కబడ్డీ జులై-అక్టోబర్లో జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









