సుష్మాస్వరాజ్‌కు కేటీఆర్‌ అభినందనలు

- May 13, 2017 , by Maagulf
సుష్మాస్వరాజ్‌కు కేటీఆర్‌ అభినందనలు

కేంద్రంమంత్రిగా సుష్మాస్వరాజ్‌ బాధ్యతలు చేపట్టాక విదేశాల్లో ఉంటున్న లక్షలమంది భద్రంగా ఉంటున్నారని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒక్క ట్వీట్‌తో ఆమెకు తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం కల్పించారని.. సమస్యలపై ఆమె బాగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న విదేశీ సంపర్క్‌ సదస్సులో ఆయన ప్రసంగించారు. అనంతరం కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మాట్లాడుతూ విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చాలా మంది ఇక్కడ కంటే విదేశాల్లోనే ఉండటానికి మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఈ సందస్సులో ప్రవాసభారతీయుల పాస్‌పోర్టు సమస్యలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ మంత్రి నాయిని కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com